అక్షరటుడే, వెబ్​డెస్క్​: మధ్యప్రదేశ్​లో విమాన ప్రమాదం జరిగింది. శివపురి సమీపంలో ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​కు చెందిన మిరాజ్​ 2000 ఫైటర్​జెట్​ గురువారం కూలిపోయింది. శిక్షణకు సంబంధించిన ఈ విమానం ప్రమాదవశాత్తు శివపురిలోని ఓ పంటపొలంలో కూలింది. ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఎయిర్​ఫోర్స్​ అధికారులు విచారణ చేపడుతున్నారు.