అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నా హజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్‌ ఓడిపోయారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌తో కేజ్రీవాల్‌ అప్రతిష్ఠపాలయ్యారని గుర్తు చేశారు. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారన్నారు.