అక్షరటుడే, వెబ్డెస్క్: బర్డ్ఫ్లూ వైరస్ వ్యాపిస్తుండటంతో తెలంగాణలో చికెన్ రేట్లు పడిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ భయంతో మాంసం ప్రియులు చికెన్ కొనడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో అమ్మకాలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్లో 50శాతం చికెన్ అమ్మకాలు తగ్గినట్లు తెలిసింది. మొన్నటి వరకు రూ.200పైగా ఉన్న కిలో చికెన్ రూ.150కి దిగి వచ్చింది. మరోవైపు ఏపీలో ఇంకా బర్డ్ ఫ్లూ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణ జిల్లాలోనూ వైరస్ సోకింది. దీంతో ఏపీ నుంచి తెలంగాణలోకి కోళ్ల వాహనాలను అధికారులు అనుమతించడం లేదు.