అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​లో బర్డ్​ ఫ్లూ వ్యాప్తి ఆగడం లేదు. ఆ వైరస్​తో ఇప్పటికే లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. తాజాగా ఆ వైరస్​ ఓ మనిషికి సోకింది. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్​ ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బర్డ్​ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి, కోళ్లు పెంచే వారికి ఈ వైరస్​ సోకే అవకాశం ఉంది.