అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు షమీ, అక్షర్ పటేల్ దెబ్బకు 35 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో వంద పరుగులు కూడా చేస్తుందో లేదో అనుకున్న సమయంలో తావిద్(100) సెంచరీతో రాణించడంతో పాటు, జాకీర్ అలీ(68) కీలక ఇన్నింగ్స్ ఆడి స్కోర్ బోర్డు 200 పరుగులు దాటించారు. భారత బౌలర్లు షమీ ఐదు వికెట్లు, హర్షిత్ రాణా మూడు, అక్షర్ రెండు వికెట్లు తీశారు.