అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ను వెల్​నెస్​ హాస్పిటల్స్​ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హాస్పిటల్ వైస్​ ప్రెసిడెంట్​ అశోక్​కుమార్​, జనరల్​ మేనేజర్​ రాజేశ్​ పీసీసీ చీఫ్​ను మర్యాదపూర్వకంగా కలిసి నిజామాబాద్​లో నూతన బ్రాంచ్​ వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్​ డైరెక్టర్లు సుమన్​ గౌడ్​, అసద్​ఖాన్​, వివేకానంద రెడ్డి తదితరులున్నారు.