అక్షరటుడే, వెబ్​డెస్క్​: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండేకు బాంబు బెదిరింపు మెయిల్​ వచ్చింది. ఆయన వాహనాన్ని పేల్చేస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి గుర్గావ్​ పోలీస్​ స్టేషన్​కు మెయిల్​ చేశాడు. ఇలాంటి మెయిల్స్​ మంత్రాలయ, జేజే మార్గ్​ పోలీస్​ స్టేషన్లకు సైతం వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెయిల్​ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.