అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​ ఉప ముఖ్యమంత్రి ఫొటోలు మార్ఫింగ్​ చేసిన వారిపై జనసేన కార్యకర్తలు కేసులు పెడుతున్నారు. పవన్​ కల్యాణ్​ ఇటీవల కుటుంబంతో కలిసి కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఫొటోలను కొందరు మార్ఫింగ్​ చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు ఏపీలోని పలు పోలీస్​ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.