అక్షరటుడే, వెబ్​డెస్క్​: కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు(కేఆర్​ఎంబీ) సమావేశం వాయిదా పడింది. కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించాలని కేఆర్​ఎంబీ నిర్ణయించింది. దీంతో తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. అయితే తమకు అత్యవసర మీటింగ్​ ఉండడంతో సమావేశం వాయిదా వేయాలని ఏపీ అధికారులు కోరారు. దీంతో కేఆర్​ఎంబీ మీటింగ్​ను సోమవారానికి వాయిదా వేసింది.