అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: తమ పెండింగ్​ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బ్యాంక్​ ఉద్యోగులు ధర్నాకు దిగారు. శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్​ వద్ద ఎస్​బీఐ బ్యాంక్​ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. వారానికి ఐదురోజుల పనదినాలను వెంటనే అమలు చేయాలన్నారు. బ్యాంకుల్లో త్వరతగతిన శాశ్వత నియామకాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం రంగ బ్యాంక్​ ఉద్యోగుల గ్రాడ్యుటీని అమలులోకి తేవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఎస్​బీఐ ఉద్యోగులు రమేశ్​, గురునాథ్​, ప్రమోద్​, శ్రీనివాస్​, సుధాకర్​, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.