అక్షరటుడే, బోధన్: బోధన్ మండలం జాడి జమాల్పూర్–నాగన్పల్లి గ్రామాల మధ్య ట్రాన్స్ఫార్మర్ను దొంగలు ధ్వంసం చేశారు. అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్ ఎత్తుకెళ్లారని బోధన్ రూరల్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు.