అక్షరటుడే, వెబ్​డెస్క్​: కుంభమేళాలో ఇప్పటివరకు 60కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్​ పేర్కొన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 వరకు 60కోట్ల మంది కుంభమేళాకు వచ్చారని.. మహాకుంభ్​ శక్తిని ప్రపంచమే కీర్తిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశ, రాష్ట్ర సామర్థ్యం అంటే ఇష్టపడని వారు మాత్రమే కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.