అక్షరటుడే, నిజామాబాద్​అర్బన్​: నగరంలోని ఒకటో టౌన్​ పరిధిలో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హబీబ్​నగర్​కు చెందిన హమీద్​ తన కుటుంబ సభ్యులతో నాందేడ్​లో బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఇంట్లో చొరబడిన దొంగలు రూ. 4లక్షల నగదు, మూడు తులాల బంగారం అపహరించుకుని పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్​ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు.