అక్షరటుడే, ఇందూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్​కు వస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్​లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్​లో ఉదయం 11 గంటలకు భూమారెడ్డి ఫంక్షన్ హాల్​లో సమావేశం ఉంటుందన్నారు. కాంగ్రెస్​ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులను విస్మరించిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి రూ.30 కోట్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్​కి ఇచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారన్నారు. ఈ వ్యాఖ్యలు నిజమో.. కాదో వారు సమాధానం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నుడా ఛైర్మన్ కేశ వేణు, యూత్​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు విపుల్​గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.