అక్షరటుడే, వెబ్​డెస్క్​: డీజీ అంజనీకుమార్​, అభిలాష బిస్తను రిలీవ్​ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పని చేస్తున్న మాజీ డీజీపీ అంజనీకుమార్​, ఐపీఎస్​ అధికారులు అభిలాష బిస్త, అభిషేక్​ మహంతి ఏపీలో జాయిన్​ కావాలని కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో డీజీ అంజనీకుమార్​, ఐపీఎస్​ అభిలాష బిస్తను తెలంగాణ ప్రభుత్వం శనివారం రిలీవ్​ చేసింది. తక్షణమే ఇద్దరు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.