అక్షరటుడే, వెబ్​డెస్క్​: జేఈఈ మెయిన్స్​ పేపర్​–2 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. బీఆర్క్​/బీ ప్లానింగ్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 30న పరీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 15న ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. 22న తుది కీ విడుదల చేశారు. తాజాగా ఆదివారం తుది ఫలితాలను విడుదల చేశారు. దేశశ్యాప్తంగా బీఆర్క్​ పరీక్షకు 44,144 మంది, బీ ప్లానింగ్​కు 18,596 మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్​ రెండో సెషన్​ పరీక్ష ఏప్రిల్​ 1 నుంచి 8 మధ్య నిర్వహించనున్నారు.