సెంచరీతో విరాట్​ కోహ్లీ రికార్డు

0

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా జరిగిన భారత్​–పాక్​ మ్యాచ్​లో ఇండియా జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో క్లోహ్లీ సెంచరీతో చెలరేగి ఆడి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. అనంతరం భారత జట్టు బరిలోకి దిగగా దూకుడుగా ఆడిన రోహిత్​ శర్మ(20) వద్ద ఔట్​ అయ్యాడు. దీంతో కోహ్లీ జట్టు గెలుపు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ స్కోర్​ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. శుభ్​మన్​ గిల్​(46), శ్రేయస్​ (56)లు వెనుదిరిగినా.. కోహ్లీ సెంచరీతో జట్టు గెలుపులో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ సెంచరీతో 14వేల పరుగుల మైలు రాయిని దాటి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.