అక్షరటుడే, వెబ్డెస్క్ Donald Trump : యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తనకున్న అక్కసును వెళ్లదీసుకున్నారు. మరోసారి భారత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ నుంచి భారత్కు ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపై భారత్ అత్యధికంగా పన్ను విధిస్తోందని ఫస్ట్ నుంచి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే కదా.
మరోసారి అదే విషయంపై వైట్ హౌస్లో వ్యాఖ్యలు చేశారు ట్రంప్. భారత్ ఇష్టమున్నట్టుగా టారిఫ్ను పెంచుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాన్ని మేమే బట్టబయలు చేశామని అన్నారు. భారత్ అత్యధిక టారిఫ్ విధానాన్ని తామే బట్టబయలు చేశామని, దీంతో భారత్ దిగి వచ్చి పన్నులు తగ్గించేందుకు ఒప్పుకుందని ట్రంప్ అన్నారు.
Donald Trump : అందుకే మేము కూడా టారిఫ్ పెంచాం
భారత్ అత్యధిక పన్ను వసూలు చేయడం వల్ల తాము కూడా ఆ దేశంపై టారిఫ్ను పెంచాల్సి వచ్చిందని ప్రెస్ మీట్లో ట్రంప్ వెల్లడించారు. అందుకే.. ఇప్పుడు భారత్ టారిఫ్ను తగ్గించేందుకు ముందుకు వచ్చిందని ట్రంప్ తెలిపారు.
అయితే.. భారత్తో పాటు కెనడా, మెక్సికో, చైనా లాంటి దేశాలపై ట్రంప్ కొత్త టారిఫ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానుంది. దీని వల్ల ఇండియాపై ఏడాదికి కనీసం ఏడు బిలియన్ డాలర్ల భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి భారత్ విధించిన టారిఫ్పై ఇలా తన అక్కసును వెళ్లగక్కారు.