అక్షరటుడే, నల్గొండ: నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద రూ.23 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ మాయమైన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును నార్కెట్పల్లి సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆపారు. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి నగదు బ్యాగ్ ను బస్సులో ఉంచి టిఫిన్ చేసేందుకు దిగారు. తిరిగి వచ్చాక నగదు మాయమైనట్లు గుర్తించారు. బాధితుడు నార్కెట్పల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.