అక్షరటుడే, బోధన్:​ మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు చేస్తుండగా.. సంగం గ్రామానికి చెందిన గంగాదీపక్​, రెంజల్​బేస్​నకు చెందిన సాయిలు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నారు. సోమవారం సెకండ్​ క్లాస్​ మేజిస్ట్రేట్​ ఎదుట హాజరు పర్చారు. అలాగే బహిరంగంగా మద్యం తాగుతున్న మరో ఇద్దరికి, అంబేద్కర్​ చౌరస్తాలో రోడ్డుపై పండ్ల బండి ఏర్పాటు చేసి ట్రాఫిక్​కు అంతరాయం కలిగించిన ఒకరిని కూడా మేజిస్ట్రేట్​ ఎదుట హాజరుపర్చగా ఈ ఐదుగురికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పోలీసులు తెలిపారు. ​