అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ సబ్స్టేషన్ కెపాసిటర్ బ్యాంక్లో మంటలు చెలరేగాయి. దీంతో ట్రాన్స్ఫార్మర్ సెల్స్ పేలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సబ్స్టేషన్ అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సబ్స్టేషన్కు చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయమై ఎస్ఈ శ్రవణ్ కుమార్ను వివరణ కోరగా.. సబ్స్టేషన్లో పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని, సెల్స్ కొత్తవి అమర్చితే ఇబ్బంది ఉండదన్నారు.