అక్షరటుడే, హైదరాబాద్​: రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్​లో జరిగిన సమావేశంలో పార్టీ లైన్​ దాటుతున్న ఎమ్మెల్యేలపై ఘాటుగానే చర్చ జరిగినట్లు సమాచారం. నేతలెవరైనా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలపై అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలని సీనియర్​ నేతలు సూచించినట్లు సమాచారం.