అక్షరటుడే, ఆర్మూర్ : బాల్కొండ మండలం చిట్టాపూర్ వసంత ఫంక్షన్​ హాల్​లో నిరుద్యోగ యువతుల కోసం ఆదివారం జాబ్​మేళా నిర్వహించారు. హైదరాబాద్​లోని ఎస్​కేఎస్​ఎస్​ కంపెనీ సౌజన్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, గ్రామానికి చెందిన ఏనుగు దయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్​ మేళా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ కృష్ణ, ఆర్గనైజర్ రాజ్​కుమార్, న్యవనంది గణేష్, సందీప్, కేఎన్​డీ మూర్తి, మల్లేష్ గౌడ్, బీఆర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.