అక్షరటుడే, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాలో ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును భారత్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు నేరస్థుల అప్పగింత అస్త్రం ప్రయోగించనున్నారు. ఈ మేరకు రెడ్‌కార్నర్ నోటీస్‌కు హైదరాబాద్‌ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కరుడుగట్టిన నేరస్థులను అప్పగించే విషయంలో.. భారత్, అమెరికా మధ్య ఒప్పందం ఉంది. దీనిని ఇప్పుడు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ప్రయోగించనున్నారు. ఇప్పటికే కేంద్రానికి సీఐడీ నివేదిక పంపింది. అమెరికాకు విదేశీ వ్యవహారాల శాఖ నివేదిక పంపనుంది. మరోవైపు అమెరికాలో ఇప్పటికే ప్రభాకర్‌ గ్రీన్‌కార్డ్‌ పొందారు. ఇక వీసా గడువు ముగిసినా శ్రవణ్‌రావు అమెరికాలోనే ఉండిపోయారు.