అక్షరటుడే, బోధన్: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని రమాకాంత్ ఫంక్షన్ హాల్ వద్ద ఉదయం బీర్కూర్ నుంచి బోధన్కు వస్తున్న బస్సు బైక్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.