అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: అర్ధరాత్రి వరకు పాన్‌షాప్‌ తెరిచి ఉంచిన వ్యక్తికి సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జైలు శిక్ష విధించారు. వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని జిల్లా జనరల్‌ ఆస్పత్రి పక్కన రిజ్వాన్‌ అనే వ్యక్తి పాన్‌షాప్‌ను అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచుతున్నాడు. దీంతో అతడికి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా ఆ వ్యక్తికి సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ అహ్మద్ మొయినుద్దీన్ ఒకరోజు జైలుశిక్ష విధించారు.