అక్షరటుడే, ఇందల్వాయి: ఆగి ఉన్న వాహనాన్ని అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్​ ఢీకొంది. ఈ ఘటన గురువారం ఉదయం ఇందల్వాయి మండలం చంద్రాయన్​పల్లి వద్ద చోటు చేసుకుంది. రోడ్డుపై వాహనాన్ని నిలిపి ఉన్న టోల్​ప్లాజా సిబ్బంది పనులు చేస్తుండగా డీసీఎం ఢీకొంది. దీంతో వాహన డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు వాహనాలు జాతీయ రహదారిపై ఇరుక్కుపోయాయి. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ అయింది.