అక్షరటుడే, వెబ్డెస్క్: నటుడు మంచు మోహన్బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్ట్పై దాడి కేసులో ఆయనకు ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 10న ఓ జర్నలిస్ట్పై మోహన్బాబు మైక్తో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంను ఆశ్రయించగా గురువారం విచారించిన ధర్మాసనం బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.