అక్షరటుడే, బాన్సువాడ: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్​రెడ్డి సోమవారం తన నివాసంలో పంపిణీ చేశారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, మోస్రా మండలాలకు చెందిన 181 మంది లబ్ధిదారులకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్​ ఛైర్మన్​ కాసుల బాలరాజ్​తో కలిసి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూరు మార్కెట్ కమిటీ ఛైర్​పర్సన్​ శ్యామల శ్రీనివాస్, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్​ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.