అక్షరటుడే, వెబ్​డెస్క్​: మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి కాన్వాయ్​లో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కారు డ్రైవర్​ సడెన్​గా బ్రేక్​ వేయడంతో ఎనిమిది కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సూర్యాపేట గరిడేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంత్రి హుజూర్​ నగర్​ నుంచి జాన్​ పహాడ్​ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మూడు కార్లు ధ్వంసమయ్యాయి.