అక్షరటుడే, డిచ్​పల్లి: జాతీయ రహదారిపై డిచ్​పల్లి సమీపంలో శనివారం అమ్మోనియా యాసిడ్​ ట్యాంకర్​ బోల్తా పడింది. కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్​ వైపు వెళ్తున్న ట్యాంకర్​ బ్రేకులు ఫెయిల్​ కావడంతో డిచ్​పల్లి శివారులోని నాగ్పూర్ ​ గేటు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి లిక్విడ్ బయటికు వస్తుండడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.