అక్షరటుడే, ఆర్మూర్: వినియోగదారుల మండలి ఆధ్వర్యంలో బుధవారం ఆర్మూర్ అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార కల్తీ – అయోడిన్ ఉప్పు లో ప్లాస్టిక్ అంశంపై చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి మాట్లాడుతూ.. ఆహార కల్తీ మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న క్రమంలో వినియోగదారులు చైతన్య వంతులు కావాలన్నారు. ఉప్పు, పప్పులు, వంటనూనెలు మొదలుకొని వివిధ రకాల అయోడిన్ ఉప్పు లు ప్లాస్టిక్ సంచుల్లో అమ్మకం జరుగుతున్నందున మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి చేరి క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం – 2013 నిబంధనల ప్రకారం ఆహార పదార్థాలను ప్యాకింగ్ చేస్తే, దానిపై ఆ ప్లాస్టిక్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు ముద్రించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు రాజుల రామనాథం, వి.యన్.వర్మ, ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు పౌడపల్లి అనిల్, రూరల్ ఇంఛార్జి కార్యదర్శులు యాటకర్ల దేవేష్, అంగన్వాడీ సూపర్వైజర్లు నళిని, వెన్నెల వెంకట రమణమ్మ, అంగన్వాడీ టీచర్, హెల్పర్స్, విద్యార్థిని, విద్యార్థులు, బాలింతలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.