అక్షరటుడే, ఇందూరు: వెజ్బిర్యానీ ఆర్డర్ చేస్తే.. అందులో చికెన్ ముక్క వచ్చిన ఘటన నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన సుధాకర్రెడ్డి కుటుంబంతో కలిసి శుక్రవారం వంశీ హోటల్కు వెళ్లాడు. రెస్టారెంట్లో వెజ్బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే వెజ్బిర్యానీలో చికెన్ముక్క దర్శనమివ్వడంతో కస్టమర్ అవాక్కయ్యాడు. అనంతరం సిబ్బందిని ప్రశ్నిస్తే.. పొరపాటున చికెన్ ముక్క వచ్చిందని సర్దిచెప్పడం గమనార్హం.