అక్షరటుడే, వెబ్డెస్క్: లిఫ్ట్లో ఇరుక్కుని గాయపడ్డ బాలుడు ఆర్నవ్ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శుక్రవారం హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ శాంతినగర్ అపార్ట్మెంట్లోని లిఫ్ట్లో బాలుడు ఆర్నవ్ చిక్కుకున్నాడు. దీంతో స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలుడిని బయటకు తీసి నీలోఫర్కు తరలించారు. ఆస్పత్రిలో సర్జరీ చేసి వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ బాలుడి ప్రాణం నిలువలేదు. పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.