అక్షరటుడే, కామారెడ్డి: బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులను నియమించారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని 22 మండలాలకు నూతన అధ్యక్షులు నియమితులయ్యారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రకటన విడుదల చేశారు. నూతన అధ్యక్షుల నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అలాగే జిల్లా కౌన్సిల్ మెంబర్గా రుద్రూర్కు చెందిన ప్రశాంత్ గౌడ్ నియమితులయ్యారు.
మండల అధ్యక్షులు వీరే..
బీర్కూర్ – నాగెళ్ల సాయికుమార్
రుద్రూర్ – హరికృష్ణ
చందూర్ – మడిశెట్టి విఠల్
మోస్రా – శ్రీకాంత్
కోటగిరి – ఏముల శ్రీనివాస్
ఎల్లారెడ్డి టౌన్ – రాజేశ్
తాడ్వాయి – సంతోష్ రెడ్డి
లింగంపేట – క్రాంతి కుమార్
నాగిరెడ్డిపేట – శ్రీనివాస్
జుక్కల్ – మేత్రి బాలరాజు కుర్మ
బిచ్కుంద – విష్ణు
మద్నూర్ – తుకారం పటేల్
డోంగ్లీ – ధనుంజయ్ పాటిల్
మాచారెడ్డి – బూస సురేష్
పాల్వంచ – పోసు అనిల్
బీబీపేట – అల్లం ప్రవీణ్
దోమకొండ – భూపాల్ రెడ్డి
భిక్కనూరు – ఉప్పరి రమేశ్
రాజంపేట – సంపత్ రెడ్డి
కామారెడ్డి రూరల్ – శ్రీధర్
కామారెడ్డి టౌన్ – మోటూరి శ్రీకాంత్