అక్షరటుడే, న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్(85) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో తాత్కాలిక రామమందిరానికి సత్యేంద్రదాస్ పూజారిగా ఉన్నారు. కూల్చివేతకు ముందు విగ్రహాలను సమీపంలోని ఫకీరే మందిరానికి తరలించి, రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. తన 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్య భూమిక పోషించారు.