అక్షరటుడే, వెబ్​డెస్క్​: ప్రభుత్వం ఎల్​ఆర్​ఎస్​ పేరిట ఒక్కో ప్లాట్​ నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసేందుకు యత్నిస్తోందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి ఆరోపించారు. రేవంత్​రెడ్డికి మాట తప్పడం అలవాటుగా మారిందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎల్​ఆర్​ఎస్​ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్​ నాయకులు నిరసన తెలిపారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే రేవంత్​రెడ్డి మాట మార్చారన్నారు. ఎల్​ఆర్​ఎస్​ పేరిట ప్రజలను దోచుకోవాలని చూస్తే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.