అక్షరటుడే, నిజామాబాద్సిటీ : క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం క్రికెట్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు, చదువుతో పాటు ఆటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ లీగ్ను హాస్పిటల్ ఎండీ సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా 24 టీంలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజారెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ పాల్గొన్నారు.