అక్షరటుడే, కోటగిరి: డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఇద్దరు నిందితులకు బోధన్​ సెకండ్​ క్లాస్​ మేజిస్ట్రేట్ శేషతల్ప​ సాయి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. కోటగిరి పోలీసులు డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా.. గౌతమ్​ శింగరే, షేక్​ హుస్సేన్​ అనే వ్యక్తులు మద్యం తాగి పట్టుబడ్డారు. వారిని బుధవారం కోర్టు ఎదుట హాజరు పర్చగా జడ్జి జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సందీప్​ తెలిపారు.