అక్షరటుడే, ఆర్మూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 420 రోజులవుతున్నా హామీలు నెరవేర్చకపోవడంపై ఆర్మూర్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పూజా నరేందర్, మాజీ జడ్పీటీసీ మెట్టు సంతోష్, పోల సుధాకర్, గంగాధర్, లింబాద్రి గౌడ్, నచ్చు చిన్నారెడ్డి, మీరా శ్రావణ్, అగ్గు క్రాంతి, ఆనంద్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.