అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ను ఒంటరిగా పోటీ చేయించి బీజేపీని గెలిపించారని ఎద్దేవా చేశారు. బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కడ ప్రచారం చేసి, కాంగ్రెస్కు గుండు సున్నా తెచ్చారని వ్యాఖ్యానించారు.