అక్షరటుడే, వెబ్డెస్క్: బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. ఢాకా నుంచి తీసుకువస్తున్న 1.745 కిలోల బరువు ఉన్న బంగారు కడ్డీలను పశ్చిమ బెంగాల్లోని నాడియ జిల్లా సరిహద్దులో స్వాధీనం చేసుకున్నారు. ఈ పసిడి విలువ రూ.1.48కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.