అక్షరటుడే, వెబ్డెస్క్: ఎలక్షన్ కమిషన్ కంటే మాజీ సీఎం జగన్ గొప్పవాడేం కాదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులోని మిర్చి మార్కెట్ యార్డ్కు జగన్ వెళ్లిన ఘటనపై స్పందిస్తూ.. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్కు వెళ్లి.. తీరా వెళ్లాక తనకు భద్రత ఇవ్వలేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ పూర్తిగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని అందుకే పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు.