అక్షరటుడే, వెబ్​డెస్క్​: దావోస్​ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్​ చేరుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన దావోస్​లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. కాగా దావోస్​ నుంచి వచ్చిన ముఖ్యమంత్రికి కాంగ్రెస్​ నాయకులు శంషాబాద్​ ఎయిర్​పోర్టులో ఘన స్వాగతం పలికారు.