అక్షరటుడే, ఇందూరు: బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దినేష్ కులాచారి మంగళవారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తనని రెండోసారి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు.