అక్షరటుడే, వెబ్డెస్క్: వైద్యురాలు నదిలో కొట్టుకుపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనన్యరావు తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దిగింది. ఈ క్రమంలో వరద ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయింది. దీంతో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వైద్యురాలి కోసం గాలిస్తున్నారు.