అక్షరటుడే, వెబ్డెస్క్: ఏటా మనం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. జనవరి 26,1950న భాతర రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈసారి జనవరి 26, 2025న ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నాం. ఈ ప్రత్యేక వేడకల్లో సెలబ్రేట్ చేసుకునే కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం..
రిపబ్లిక్ డే థీమ్
ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ థీమ్ ను ఏర్పాటు చేసుకుంటాం. 2025 థీమ్ ‘సర్జిమ్ భారత్ విరాసత్ ఔర్ వికాస్..’ అంటే ‘బంగారు భారతదేశం వారసత్వం, అభివృద్ధి..’ ఇది మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కొనసాగుతున్న పురోగతిని చెబుతుంది.
ముఖ్య అతిథి
ఈసారి గణతంద్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. భారత్, ఇండోనేషియా మధ్య దౌత్య సంబంధాల విషయంలో ఇది ముఖ్యమైన మైలురాయి.
రిపబ్లిక్ డే చరిత్ర
ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ పాలనపరమైన సొంత రాజ్యాంగం లేదు. దీంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి, భారత రాజ్యాంగం రూపొందించారు. 1948 నవంబర్ 26న రాజ్యాంగ సభ దీనిని ఆమోదించింది. డిసెంబర్ 19, 1929న లాహోర్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేయడం, జనవరి 26, 1930న స్వాతంత్ర్య దినోత్సవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆ రోజుకు ప్రాధాన్యం కల్పిస్తూ.. జనవరి 26, 1950న భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
రిపబ్లిక్ డే ప్రాధాన్యం
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రజాస్వామ్య ఆదర్శాలపై భారత దేశ నిబద్ధతను ప్రతిబింబించడం.
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన వేడుక.
వేడుక సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో భారత దేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించడం.
భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించడం.
భిన్నత్వంలో భారతదేశం బలాన్ని ఎత్తిచూపడం.
జాతీయ ఐక్యతను పెంపొందించడం.
భారతదేశానికి స్వతంత్రం రావడానికి, గణతంత్రాన్ని నిర్మించడంలో సహాయపడిన నేతలు, స్వాతంత్య్ర సమరయోధుల పరాక్రమం, త్యాగాలను స్తుతించడం.