అక్షరటుడే, వెబ్డెస్క్: అక్కడా.. ఇక్కడా కాదు.. ఏకంగా తెలంగాణ సచివాలయంలోనే నకిలీ ఉద్యోగులు దర్జాగా తిష్ట వేశారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఫేక్ ఐడీ కార్డులు ధరించి సచివాలయంలోని ఆయా కార్యాలయాల్లో నకిలీ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండడం వింతగా మారింది. అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నారు. గురువారం తాజాగా.. కొంపల్లి అంజయ్య అనే వ్యక్తి తహశీల్దార్ పేరుతో సచివాలయంలో హల్చల్ చేయగా అతడిని పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.