అక్షరటుడే, వెబ్​డెస్క్​: ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి దావోస్​ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి తీసుకొచ్చిన పెట్టుబడులపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్​ నాయకులు వారికి కౌంటర్​ ఇస్తున్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు చూసి బీఆర్​ఎస్​ నాయకుల కడుపు మండుతోంది అన్నట్లు హైదరాబాద్​ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పెట్టుబడులు చూసి కడుపు మంటా.. అయితే ఈనో వాడండి అంటూ హోర్డింగ్​లు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలపై కేసీఆర్​, కేటీఆర్​ చిత్రాలను ముద్రించారు.