అక్షరటుడే, వెబ్​డెస్క్​: మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​ సవాల్​ విసిరారు. కేటీఆర్​కు దమ్ముంటే శివారెడ్డిపల్లి రావాలన్నారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత రుణమాఫీ అయ్యిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.1000 కోట్ల రుణమాఫీ చేసిందని చెప్పారు. కేటీఆర్‌, హరీష్‌, కవిత లాటరీ బ్యాచ్ అని ఆయన విమర్శించారు.